కాంగ్రెస్ ఆఫర్
మైనంపల్లికి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మైనంపల్లి కోరినట్లు రెండు టిక్కెట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి చర్చలు జరిపారని టాక్ నడుస్తోది. మైనంపల్లికి మల్కాజ్ గిరి, రోహిత్కు మెదక్ అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్లు సమచారం. మెదక్ టికెట్ ఆశిస్తున్న తిరుపతిరెడ్డి, శశిధర్రెడ్డిలను కూడా ఒప్పించి, మైనంపల్లి కుమారుడుకి సహకరిస్తామని వారితో ఒప్పించినట్లుగా తెలుస్తోంది. మైనంపల్లి ఆర్థికంగా బలవంతుడు కావడంతో కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనను కాంగ్రెస్ లోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.