వారికి అనుమానం రాకూడదని కావ్య చొరవ తీసుకొని రాజ్ చేయిపట్టుకుంటుంది. సంక్షేమ సంఘం వారు వెళ్లిపోయిన తర్వాత తమ ఇంటి పేరు నిలబెట్టిన కావ్యకు ఏ బహుమానం కావాలో కోరుకోమని సీతారామయ్య అడుగుతాడు. ఇంట్లో అందరూ తనను వెలివేసినట్లు చూస్తున్నారని, ఈరోజు నుంచి నాతో అందరూ మాట్లాడితే చాలని బదులిస్తుంది కావ్య. అంతకుమించి నాకు కావాల్సిన బహుమానం ఏది అక్కరలేదని, తనను ఈ కుటుంబంలో ఓ సభ్యురాలిగా గుర్తిస్తే చాలు అని కావ్య అంటుంది.