మూడోస్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలిచిన వాద్లెచ్ కు రూ.18 లక్షలు దక్కడం విశేషం. ఇక ఈ ఫైనల్లో నీరజ్ తోపాటు మరో ఇద్దరు టాప్ 8లో నిలిచారు. కిశోర్ జేనా (84.77 మీటర్లు), డీపీ మను (84.14 మీటర్లు) ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఈ ఫైనల్లో నీరజ్ చోప్రా తొలి అటెంప్టే ఫౌల్ అయింది. అయితే రెండో అటెంప్ట్ లో అత్యధిక దూరం విసిరిన నీరజ్.. తర్వాత తన లీడ్ ను అలాగే కొనసాగించాడు.