గౌతమ్, ప్రశాంత్ నామినేషన్స్ ఆసక్తిగా సాగాయి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో సంచాలకుడిగా ప్రశాంత్ తప్పులు చేశాడని పేర్కొన్నాడు. ఆ టాస్కులో యావర్, శివాజీ.. ఇద్దరూ రూల్స్ బ్రేక్ చేశారని తెలిపాడు. తప్పు చేయలేదని, యావర్, శివాజీ వాదించారు. ఇలా గౌతమ్ నామినేషన్స్ సమయంలో వీరిద్దరూ చాలాసేపు జోక్యం చేసుకున్నారు. అయితే ప్రశాంత్ మాత్రం.. సంచాలకుడిగా తాను చేసింది తప్పు అయితే నాగార్జున చెప్పేవారని గట్టిగా వాదించాడు. అసలు పాయింటే లేదు.. అంటూ కామెంట్స్ చేశాడు.