ఈ రైలు సెప్టెంబర్ 1న రాత్రి 8:10 గంటలకు కాకినాడ టౌన్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ 2, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారలు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.