క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి, దేవ్ వర్మ ఈ భైరవ ద్వీపం మూవీని రీ రిలీజ్ చేయాలని భావించారు. ఈ మూవీని నవంబర్ లో రీ రిలీజ్ చేస్తామని చెప్పినా.. తేదీ మాత్రం వెల్లడించలేదు. నిజానికి ఆగస్ట్ 5వ తేదీనే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని భావించినా.. అప్పుడూ బుకింగ్స్ లేకపోవడంతో ఆగస్ట్ 30కి వాయిదా వేశారు. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది.