కోర్సు కరిక్యులమ్ లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్ షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు వీలవుతోంది. ఒకే విద్యా సంవత్సరంలో 3 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. Microsoft లో 1.27 లక్షల మంది, Salesforce లో 33,000, AWS లో 24,000, Nasscomలో 20,000. Palo Alto లో 10,000, Data Analytics లో 15,442, Cyber Security లో 12,709, Process Miningలో 10 వేల మందికి సర్టిఫికేషన్స్ పొందారు.