హిందూ మతంలో భగవంతుడిని భక్తితో పూజించే విధానం, పూజ కైంకర్యం చేసే విధానం ఉంది. సాధారణంగా అన్ని ఇళ్లలో ఇంటిలోని ఒక వ్యక్తి తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి, దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో దేవుడికి పూజలు చేస్తారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడనే నమ్మకం ఉంది. వారి మీద దేవుడి దయ ఉంటుందని బలంగా నమ్ముతారు.