రాఖీ పౌర్ణమి రద్దీ కారణంగా
రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆ సమయంలో టి-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టంగా ఉంటుందని, టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను నాలుగు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు టి-9 టికెట్లను జారీచేయమన్నారు. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా టి-9 టికెట్లు జారీ చేస్తామని వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.