అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి నేరుగా వచ్చే ఫిర్యాదులు, 14400 టోల్ ఫ్రీ నంబర్, యాప్కు వచ్చే ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఫిర్యాదులో పేర్కొన్న అధికారి క్షేత్ర స్థాయిలో అవినీతినికి పాల్పడుతున్నారని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అవినీతి నిరోధక శాఖ ఉద్దేశ పూర్వకంగా ఏ ప్రభుత్వ శాఖ మీద, ఉద్యోగులపై ఏక పక్ష చర్యలు తీసుకోవడం లేదని ఏసీబీ స్పష్టం చేసింది.