ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్, మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ కు లంచం డిమాండ్-jangaon crime in telugu acb raids in municipal office commissioner red handed caught ,తెలంగాణ న్యూస్


రూ.40 వేలతో చిక్కిన డ్రైవర్

తన వైపు ఎలాంటి తప్పు లేకుండా లంచం ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనతో రాజు కొద్దిరోజుల కిందట వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ ఆఫీసర్ల సూచన మేరకు రూ.40 వేలను రాజు సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత డ్రైవర్ అయిన నవీన్ కు అప్పగించేందుకు వచ్చారు. తమ పథకంలో భాగంగా అప్పటికే అక్కడికి చేరుకున్న డీఎస్పీ సాంబయ్య, ఇతర ఆఫీసర్లు రాజు రూ.40 వేలను నవీన్ కు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం డబ్బులు సీజ్ చేసి నవీన్ ను విచారించగా ఆయన అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. డ్రైవర్ నవీన్ వాంగ్మూలం తీసుకుని, కమిషనర్ లంచం డిమాండ్ చేసినట్లుగా నిర్ధారించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రజితతో పాటు డ్రైవర్ నవీన్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆఫీస్ రికార్డ్స్ స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. లంచం డబ్బుతో పట్టుబడిన ఇద్దరినీ మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ సాంబయ్య వివరించారు. ఏ పనికైనా ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.



Source link

Leave a Comment