డీఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం
రాష్ట్ర సచివాలయంలో జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి వర్గ సబ్ కమిటీ మంగళవారం భేటీ అయింది. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు సమావేశం అనంతరం మాట్లాడారు. ఇతర ఉద్యోగ సంఘాల నేతలపై తమపై విమర్శలు చేయటం కరెక్ట్ కాదన్నారు. జీపీఎస్ లో 50 శాతం పెన్షన్ గ్యారెంటీ, డీఆర్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. రిటైర్మెంట్ తర్వాత 60 శాతం పింఛన్ వెనక్కి తీసుకోవచ్చన్నారు. సీపీఎస్, జీపీఎస్ లో ఉద్యోగులకు ఆప్షన్ ఉంటుందన్నారు. 10 శాతం ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ఉంటుందని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల మధ్య వివాదాలు అంత మంచిది కాదన్నారు.